Monday, April 29, 2024

బ్యాంక్ వద్ద ప్రజలు పడుతున్న సమస్యలు వేటనే తీర్చాలి

- Advertisement -
- Advertisement -

గుండాల : మండల కేంద్రంలోని కాచనపల్లి బ్యాంక్‌ను గుండాల సిఐ రవీందర్, కొమరారం ఎస్‌ఐ శివరామకృష్ణ బుదవారం విజిట్ చేసినారు. బ్యాంక్ వద్ద ప్రజలు పడుతున్న సమస్యలు తెలుసుకొని బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి నెట్ వర్క్ సమస్యలు ఏమైనా ఉంటే త్వరగా పరిష్కరించాలని తెలిపినారు. ఇప్పుడు ప్రజలకు వ్యవసాయపనులు ఉండటం వల్ల ఎక్కువ సమయం వేచియుండకుండా చూడాలని తెలిపిన్నారు.

గుండాలలో కూడా ఎస్‌బిఐ బ్యాంకు ఉన్నది కాబట్టి ఎటువంటి బ్యాంకు లోన్స్ లేని అకౌంట్స్ గుండాలకు ట్రాన్సర్ చేయటం వల్ల కొంత రద్దీ సమస్య తగ్గుతుందని అన్నారు. యోనో, ఎస్‌బిఐ ద్వారా కూడా అకౌంట్ ట్రాన్సర్ చేసుకునే అవకాశం ఉన్నందున దాన్ని ఉపయోగించుకోవాలని ఖాతాదారులకు తెలియజేశారు. ఖాతాదారులు కూర్చోవటానికి సరైన వసతులు కల్పించాలని అన్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని బ్యాంక మేనేజర హామీ ఇచ్చనారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News