Monday, April 29, 2024

వచ్చిందే టైం.. చేసిందే డ్యూటీ..!

- Advertisement -
- Advertisement -
  • సమయపాలన పాటించని ఉద్యోగులు
  • ఉదయం 10.35 దాటినా తాళం తీయని వైనం
  • ఎంపిడిఒ కార్యాలయంలో ఇష్టానుసారంగా విధుల నిర్వహణ

బంట్వారం : బంట్వారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. వచ్చిందే టైం..చేసిందే డ్యూటీ అన్న చందంగా తయారైంది. ఉదయం 10 గంటలకు కార్యాలయాన్ని తెరిచి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు 10.35 దాటినప్పటికీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం తాళం తీయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉద్యోగులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రతిష్టాత్మకంగా జియో అటెండెన్స్‌ను తీసుకువచ్చారు. అయినప్పటికీ అధికారులు సమయపాలన పాటించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News