Saturday, April 27, 2024

సిఎం కెసిఆర్ సెంటిమెంట్ ఆలయంలో చోరీ

- Advertisement -
- Advertisement -

నంగునూరు: సిఎం కెసిఆర్ సెంటిమెంట్ ఆలయంగా ప్రసిద్ధి గాంచిన నంగునూరు మండలంలోని కొనాయిపల్లి వేంకటేశ్వర స్వా మి ఆలయంలో శనివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాజగోపాల్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొనాయిపల్లిలోని ప్రసిద్ధ్ది చెందిన వేంకటేశ్వర స్వామి ఆలయ గేట్ తాళాన్ని పగులగొట్టి ఆలయ గర్భగుడి ముందు ఉన్న హుండీని ఎత్తు కెళ్లారు. హుండిలోని డబ్బులను ఆపహరించి హుండీని హుండిలోని డబ్బులను ఆపహరించి హుండీని గ్రామ సమీపంలో గల మామిడి తోటలో పడవేశారని తెలిపారు. ముండిలో ఉన్నదాదాపు 25 వేల రూపాయలు దొంగలించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నిమ్మ విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజగోపాల్ పేట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News