- Advertisement -
కేంద్రమంత్రి రమేశ్పోఖ్రియాల్
న్యూఢిల్లీ : కేంద్ర విద్యా సంస్థల్లో జనవరి లేదా ఫిబ్రవరిలో బోర్డు పరీక్షలు నిర్వహించబోమని విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఆన్లైన్లో నిర్వహించే ఆలోచన కూడా లేదని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. మంగళవారం అధ్యాపకులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన వివరణ ఇచ్చారు. 2021లో నిర్వహించే బోర్డు పరీక్షల్ని ఆన్లైన్లో కాకుండా రాత పద్ధతిలోనే నిర్వహిస్తామని సిబిఎస్ఇ ఇటీవలే ప్రకటించింది. కొవిడ్ విజృంభణతో ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 15 నుంచి పాఠశాలల్ని పాక్షికంగా తెరిచారు.
- Advertisement -