- Advertisement -
అమరావతి: అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుత్తి మండలం జక్కల చెరువు వద్ద పెళ్లికి వెళ్తున్న కారును వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పెళ్లికూతురుతో పాటు ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కర్నూలు నుంచి కొండాపురం గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. మృతులంతా కొండాపురం గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమత్తం మార్చురీకి తరలించి విచారణ చేస్తున్నారు.
three death in road accident at anantapur district
- Advertisement -