అమరావతి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న వాహనాన్ని వేగంగా వచ్చిన స్కార్ఫియో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా… మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయాపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
బాధితులు ఒడిస్సా రాష్ట్రం పశ్చిమబంగా ఖరగ్పూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. విశాఖలో హిందూస్థాన్ షిప్యార్డ్లో క్రేన్ కుప్పకూలిన ప్రమాదఘటనలో 11మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ మృతుల్లో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కూలి ఒకరు ఉన్నారు. కొడుకు మృతదేహాన్ని కడసారి చూడడానికి అతని కుటుంబం ఒడిస్సా నుంచి స్కార్ఫియోలో విశాఖపట్నం బయలుదేరింది. ఈ క్రమంలోనే ఈ రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Three killed in road accident at srikakulam district