Monday, April 29, 2024

టైగర్ దండయాత్ర మొదలు కాబోతుంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని వంశీ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్… అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ బ్యానర్‌పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు టైగర్ దండయాత్ర మొదలుకాబోతుంది. ఈనెల 17న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్.

టైగర్ నాగేశ్వరరావు రాకకు చిహ్నంగా టీజర్ పోస్టర్‌లో బిగ్ యాక్షన్‌లోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది.దర్శకుడు వంశీ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు, తనకి నిర్మాతల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది రవితేజకు హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున, మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News