Monday, April 29, 2024

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీగా భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించకుంటున్నారు.

కాగా, శుక్రవారం శ్రీవారి 56,588 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 16,754 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.26కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News