Friday, April 26, 2024

‘బాలీవుడ్ కాదు.. టాలీవుడ్ నంబర్ వన్’: కంగనా

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి హీరోయిన్ కంగన రనౌత్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. బాలీవుడ్ లో నెపోటిజమ్ చెలరేగిపోయిందని ధ్వజమెత్తిన కంగనా.. తాజాగా బాలీవుడ్ లో డ్రగ్స్  వాడకంపై కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటారని కంగనా ఆరోపించింది. దీంతో అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ డ్రగ్స్ వ్యవహారంపై రాజ్యసభలో మాట్లాడుతూ.. కంగనాపై మండిపడ్డారు. దీంతో కంగనా జయాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఈ వివాదంతో ప్రస్తుతం బాలీవుడ్ అంతా ఒకవైపు, కంగనా ఒకవైపు అన్నట్లు పరిస్థితి నెలకొంది. తాజాగా కంగనా సోషల్ మీడియాలో మరోసారి బాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.’ ఈ దేశంలో నెంబర్ వన్ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ అని అందరూ అనుకుంటారు. అయితే అది తప్పు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానంలోకి వచ్చింది. టాలీవుడ్ పాన్-ఇండియా సినిమాలను తరచుగా నిర్మిస్తోంది. చాలా వరకు బాలీవుడ్ సినిమాలు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్స్ జరుపుకుంటాయి అని పేర్కొంది.

Tollywood is Top Film Industry in India: Kangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News