- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్ధతి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించి, సిఎం కెసిఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.
- Advertisement -