- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో అన్ని కోర్టులు తెరవాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. డిసెంబర్ 31వ వరకు కోర్టులు పాటించాల్సిన అన్ లాక్ విధానాలను వెల్లడించింది. హైదరాబాద్ జిల్లాలోని సివిల్, జిల్లా కోర్టులు తెరవాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఇప్పటికే అన్ని జిల్లాల్లో కేసుల విచారణ భౌతికంగా కొనసాగుతున్నాయి. హైకోర్టులో డిసెంబర్ 31వరకు ప్రస్తుత ఆన్ లైన్, భౌతిక విచారణ కొనసాగనుంది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగంగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు గడువుకు కట్టుబడి విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసింది.
TS HC Orders to Reopen all District Courts
- Advertisement -