Monday, April 29, 2024

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Two arrested for running cricket betting

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.45,000, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్, బోయినపల్లికి చెందిన రాజేష్‌కుమార్, ఫుడ్‌గ్రేయిన్ వ్యాపారం చేస్తున్నాడు. హబీబ్ నగర్, సీతారాం బాగ్‌కు చెందిన పవన్ కుమార్ అట్టాల్ వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరు నిందితులు బంధవులు చేస్తున్న వ్యాపారంలో వస్తున్న డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపిఎల మ్యాచ్‌లు జరుగుతుండడంతో పలు మ్యాచుల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బిఎండబ్లూ ఎక్స్ యాప్ ద్వారా బెట్టింగ్ కడుతున్నారు.

సికింద్రాబాద్‌కు చెందిన బోజా గోపాల్ యాదవ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. బెట్టింగ్ కడుతున్న వారికి యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను ఇస్తున్నారు. ఇద్దరు నిందితులు క్రికెట్ లైవ్ గురూ ద్వారా గత ఏడాది నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. 25 నుంచి 30మంది పంటర్ల సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను స్థానిక హబీబ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ గట్టుమలు, ఎస్సైలు మల్లికార్జున్, ఎండి ముజఫర్ తదితరులు పట్టుకున్నారు.

Two arrested for running cricket betting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News