Friday, May 24, 2024

నాగ్‌పూర్‌లో ఒకే బెడ్‌పై ఇద్దరు కొవిడ్ పేషెంట్లు, ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

Two Covid patients on the same bed in Nagpur

 

విమర్శలతో పడకల పెంపు

నాగ్‌పూర్: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి(జిఎంసిహెచ్)లో ఒకే పడకపై ఇద్దరు కొవిడ్ పేషెంట్ల ఫోటోలు వైరల్ అయ్యాయి. దాంతో, అప్రమత్తమైన వైద్య అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. హాస్పిటల్‌కు పేషెంట్లు పెరగడంతో తప్పని పరిస్థితి నెలకొన్నదని అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖర్చులు భరించలేక బాధితులు తమ దగ్గరికి వస్తున్నారని వారు తెలిపారు. ప్రస్తుతం పడకల సంఖ్య పెంచామని, ఒక బెడ్‌పై ఒక్కరే పేషెంట్ ఉన్నారని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అవినాశ్ గవాండే తెలిపారు. నాగ్‌పూర్‌లో సోమవారం ఒక్కరోజే 3100 కేసులు, 55 మరణాలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News