Monday, April 29, 2024

సచివాలయ ప్రాంగణంలో యూనియన్ బ్యాంక్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సచివాలయం ఉద్యోగులకు బ్యాంకు ఉత్తమ సేవలు అందించేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. బుధవారం డాక్టర్ .బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ సముదాయం ప్రాగంణంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులతో కలసి స్ట్రాంగ్ రూమ్ , కంప్యూటర్ సెంటర్‌ను ఆమె పరిశీలించారు. సచివాలయం ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. బ్యాంక్ అధికారులు, సిబ్బందికి సిఎస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బిఆర్‌కె భవన్‌లో సేవలు అందిస్తున్న బ్యాంకు బ్రాంచి ఇక నుంచి నూతన కార్యాలయం ద్వారా సేవలు కొనసాగిస్తుందని బ్యాంక్ చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కారే భాస్కర్ రావు, రీజినల్ హెడ్ కె శ్రీధర్ బాబు, బ్రాంచ్ చీఫ్ మేనేజర్ విజయ్‌కుమార్, బ్యాంక్ మేనేజర్ అనూష పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News