Monday, April 29, 2024

నేపాల్‌లో యుపిఐ సేవలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

నేపాల్‌లో భారత్‌కు చెందిన యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపిఐ) సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) తాజాగా ప్రకటించింది. నేపాల్ వ్యాపారుల వద్ద ఇకపై క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి యూపీఐ వినియోగదారులు చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. గతేడాది సెప్టెంబరులో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్‌ఐపిఎల్),

నేపాల్ అతిపెద్ద చెల్లింపు నెట్‌వర్క్ ఫోన్‌పే పేమెంట్ సర్వీస్‌ల మధ్య భాగస్వామ్యం కుదరగా, తాజాగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో యూపీఐ ఆధారిత యాప్‌ల ద్వారా భారత వినియోగదారులు నేపాల్‌లోని వ్యాపార కేంద్రాల వద్ద యూపిఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఫోన్‌పే నెట్‌వర్క్‌పై ఉన్న వ్యాపారులకు భారత వినియోగదారులు యూపిఐ ద్వారా చెల్లించొచ్చు. ఇరు దేశాల పౌరుల మధ్య లావాదేవీల్లో ఈ సేవలు విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఎన్‌ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రితేశ్ శుక్లా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News