Monday, April 29, 2024

ఫెడ్ వడ్డీ రేట్లపైనే దృష్టి

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్ గత రెండు-మూడు వారాలుగా అద్భుతమైన ర్యాలీని కనబరుస్తోంది. సూచీలు కొత్త రికార్డును నెలకొల్పాయి. అయితే వారం చివరి రోజున సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా అమ్మకాలను చూశాయి. గత వారంలో సెన్సెక్స్ 623.36 పాయింట్లు లేదా 0.94 శాతం లాభపడి 66,685 పాయింట్ల దగ్గర ముగిసింది. వచ్చే వారం చూస్తే అమెరికా సెంట్రల్ బ్యాంక్‌పైనే అందరి దృష్టి నెలకొంది.

అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఫెడరల్ రిజర్వ్ తన నిర్ణయాన్ని జూలై 26న ప్రకటించనుంది. ఈసారి కూడా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 0.25 శాతం పెంచవచ్చని భావిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా వారంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. దేశీయంగా చూస్తే కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. గత వారం అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 11 శాతం తగ్గింది. దీని ప్రభావం సోమవారం ట్రేడింగ్‌లో కనిపించనుంది.

ఈ వారంలో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టి, బిపిసిఎల్, టెక్ మహీంద్రా, నెస్లే వంటి కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించబోతున్నాయి. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేయగలవు. ఎఫ్‌పిఐలు మూడు నెలలుగా భారత మార్కెట్‌లో కొనుగోలుదారులుగా కొనసాగుతున్నారు. ఎఫ్‌పిఐ వైఖరి ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం ద్వారా ప్రభావితమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News