Monday, April 29, 2024

బైక్ పై కూర్చునందుకు… వితంతువుకు గుండు కొట్టి… చావబాదారు

- Advertisement -
- Advertisement -

Villagers attack on women with affair

గాంధీనగర్: తెలిసిన బంధువు బైక్ పై కూర్చునందుకు వితంతువుపై దాడి చేసి అనంతరం శిరోముండనం చేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం శబరకాంత జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భర్త చనిపోవడంతో ఓ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి సంచేరి గ్రామంలో నివసిస్తోంది. బ్యాంకు పని నిమిత్తం తన ఇద్దరు పిల్లలతో కలిసి హిమ్మత్ నగర్ పట్టణానికి వెళ్లింది. మార్గం మధ్యలో తెలిసిన వ్యక్తి కనిపించడంతో అతడి బైక్ పై కూర్చొని తన స్వగ్రామానికి బయలుదేరింది. గ్రామ శివారులోకి రాగానే నలుగురు బైక్ ఆపి ఆమెపై దాడి చేశారు. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని దాడికి పాల్పడడమే కాకుండా శిరోముండనం చేశారు. మరోసారి ఇద్దరు కలిసి కనిపిస్తే హత్య చేస్తామని బెదిరించారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తన బావ బైక్ ఎక్కినందుకు దాడి చేశామని నిందితుల్లో ఒకరు తెలిపారు. తెలిసిన వ్యక్తి కావడంతో బైక్ పై కూర్చున్నానని మహిళ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News