Thursday, May 16, 2024

విరాట్ ఔట్… భారత్ 179/8

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 55.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడు వికెట్లతో 40 ఓవర్లు ఆడితే డ్రా చేసే అవకాశాలు ఉంటాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు.  భారత్ బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ(72), శుభ్‌మన్ గిల్(50), ఛటేశ్వరా పుజారా(15), రిషబ్ పంత్(11), రోహిత్ శర్మ(12), రవీచంద్రన్ అశ్వన్ (09)  పరుగులు చేసి ఔటయ్యారు. వాషింగ్టన్ సుందర్, అజింక్య రహానే పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఇషాంత్ శర్మ(0), నాదీమ్(0) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, లీచ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా  డొమినిక్ బెస్, బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీశాడు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 578

ఇండియా తొలి ఇన్నింగ్స్: 337

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 178

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News