Monday, April 29, 2024

‘తీన్‌’మార్

- Advertisement -
- Advertisement -

Water fish and Milk Revolution in Telangana

 

రాష్ట్రంలో జల, నీలి, క్షీర విప్లవాలు, సంపద కేంద్రాలుగా ప్రాజెక్టులు
మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు
సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి పశుసంవర్ధక కార్యక్రమాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొర్రెలు, పాడి గేదెలు, ఉచితంగా చేప పిల్లల పంపిణీ మంత్రులు తలసాని, కెటిఆర్, ఎర్రబెల్లి, మల్లారెడ్డిల ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయాలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో నూతనంగా భారీ నీటిప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయని రానున్న రోజుల్లో వీటితో అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గొర్రెల పంపిణీతో మాంసం ఉత్పత్తి కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున పశుసంవర్ధక శాఖ, పరిశ్రమల శాఖ సమన్వయంతో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలను ఇప్పటి నుంచే రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శాఖ తరపున చేపట్టే ఏ కార్యక్రమానికి అయినా అన్ని విధాలుగా సహకరించనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న జల విప్లవంతో పాలు, మాంసం, మత్స సంపద ఉత్పత్తి పెద్ద ఎత్తున పెరిగి శ్వేత, నీలి విప్లవాలు తెలంగాణలో వస్తాయన్నారు. ఈ దిశగా పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖలతో కలిసి పరిశ్రమల శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు , ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు.

పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంగళవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డిలు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఇందుకోసం గ్రామీణ అభివృద్ధి శాఖ, పశుసంవర్ధక శాఖ, పరిశ్రమల శాఖతో కలిసి సమన్వయంతో ముందుకు పోవాలని నిర్ణయించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ, పాడి గేదెల పంపిణీ, ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలతో అమలు చేస్తున్న కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కెటిఆర్ చేసిన సూచన మేరకు శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు తమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ లేఖలు పంపిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

విజన్ కలిగిన సిఎం ప్రత్యేక చొరవతోనే రూ.5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ కారక్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రానున్న రోజులలో తెలంగాణ మాంసం, చేపలలో ఎగుమతులు చేసే స్థాయికి అభివృద్ధి సాధిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకంతో పంపాడ్‌ల నిర్మాణం చేపట్టడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. అందుకు తమ శాఖ తరపున సహకరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ సమీక్షలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్ లకా్ష్మరెడ్డి, మత్సశాఖ కమిషనర్ సువర్ణ, విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News