Sunday, April 28, 2024

కృత్రిమ మేధకు పట్టం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్సీ)టెక్నాలాజి కేంద్రంగా చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బుధవారం మాదాపూర్ లోని ఐటిసి కోహినూర్ లో జరిగిన టెలిపర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్ పీరియన్స్ సమ్మిట్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ లో హైదరాబాద్ లో ఆర్టిఫిసీయల్ ఇంటలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ ఐ కంపెనీలను సమ్మిట్‌కు ఆహ్వానిస్తుట్లు తెలిపారు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ చాలా అనువైన ప్రాంతమని,పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతుందన్నారు.1990వ దశకంలో పివి నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటి ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని, తర్వాత ఒక పార్టీ, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్, 2014లో ఇంకో పార్టీ, ఇప్పుడు మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, అయినా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిస్తూనే ఉంటామన్నారు. టెలి పర్ ఫార్మెన్స్ గ్రూప్ ఫౌండర్ డానియల్ జులియన్, సిఈవొ అనీష్ ముక్కర్‌ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్ లో అనుకూల వాతావరణం, మానవ వనరులు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పుష్కలంగా ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కు ప్లాన్ చేస్తున్నామని ఇది, ఐఎస్‌బి తరహాలో ఇది స్కిల్ మ్యాన్ పవర్ అందిస్తుందన్నారు.టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయని తెలిపారు.హైదరాబాద్ దేశానికి మధ్యలో ఉందని, ఇక్కడి నుంచి ఏ మెట్రోపాలిటన్ సిటీకి అయిన రెండు గంటల్లో వెళ్ళవచ్చన్నారు. ఇక్కడ భూకంపాలు రావు, ప్రకృతి విపత్తుల ప్రమాదం లేదన్నారు. హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటి అని, ప్రభుత్వం టూరిజంపైనా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. టూరిజం గ్రోత్ 20 శాతం పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు.ఐటి ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News