Sunday, April 28, 2024

ఇడి అధికారులతో మాజీ మంత్రి కెటిఆర్ వాగ్వాదం

- Advertisement -
- Advertisement -

కోర్టులో మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు
ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో కెటిఆర్ వాగ్వాదం

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇడి అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కెటిఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కెటిఆర్ ఇడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగు చూసింది. సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఇడి అధికారులు భానుప్రియ, మీనాలు చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని చెబుతున్నారని పేర్కొన్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు హుకూం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? అని వారిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఇడి అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఇడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకు వెళతారు? అని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News