- Advertisement -
అమరావతి: భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని సమాచారం తెలియగానే భార్య కృష్ణా నదిలో దూకిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది. మార్కేండయ నగర్కు చెందిన లోకేష్ గత కొంతకాలంగా భార్య, అత్త వేధించడంతో తన తల్లి వద్ద ఉంటున్నాడు. భర్త మరో పెళ్లి చేసుకున్నాడని సమాచారం రావడంతో ఆమె తాడేపల్లి వద్ద కనకదుర్గమ్మ వారిధి పైనుంచి నదిలో దూకింది. అక్కడ ఉన్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే ఉన్న కొందరు యువకులు ఆమెను నీళ్లలో నుంచి బయటకు తీశారు. స్థానిక సిఐ బ్రహ్మయ్య తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఇసుకలో ఒక కిలో మీటర్ మేర ఆమెను పోలీసులు మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -