- Advertisement -
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరగవరం మండలం అర్జునుడుపాలెంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య, తన భర్తను చీరతో ఉరివేసి దారుణంగా హత్య చేసింది. భర్త వేధింపులు తట్టుకోలేకనే భర్త కొండయ్యను భార్య రామలక్ష్మి చంపినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -