Thursday, May 16, 2024

యజమానురాలిని హత్య చేసిన పనిమనిషి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒంటరిగా ఉంటున్న మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు, నగదుతో పనిమనిషి పారిపోయిన సంఘటన నగరంలోని కాచిగూడలో శనివారం చోటుచేసుకుంది. కాచీగూడ ఇన్స్‌స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ కథనం ప్రకారం…కాచిగూడ, కుద్బిగూడలో రిటైర్డ్ ఈఈ లక్ష్మినారాయణ, కమలమ్మ దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గత పదిహేను రోజుల నుంచి కమలమ్మ(83) ఒంటరిగా ఉంటోంది. నాలుగు రోజుల క్రితం కమలమ్మ వద్ద పనిచేసే పనిమనిషి ఊరెళ్లడంతో ఉప్పల్ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి ఎజెన్సీ ద్వారా విజయనగరానికి చెందిన లక్ష్మిని మూడు రోజుల క్రితం, కమలమ్మ ఇంటిలో పనిచేయడానికి పంపించారు.

అయితే, శనివారం ఉదయం పనిమనిషి లక్ష్మీ దిండుతో కమలమ్మను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఆమె వద్ద ఉన్న 10తులాల బంగారు గాజులు, రూ.5,000 నగదును తీసుకుని పారిపోయింది. బాధితురాలి కుమారుడు సురేష్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని ఇన్స్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు.

Woman killed her Owner for gold ornaments in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News