Wednesday, May 15, 2024

ఈసారి మహిళల ఐపిఎల్ లేనట్టే!

- Advertisement -
- Advertisement -

Womens IPL tournment in India

న్యూఢిల్లీ: పురుషుల ఐపిఎల్ సందర్భంగా మహిళల కోసం కూడా టి20 చాలెంజ్ టోర్నీ ని నిర్వహించడం అనవాయీతీగా వస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న స్థితిలో ఈసారి మహిళల ఐపిఎల్‌ను నిర్వహించడం కష్టంగానే కనిపిస్తోం ది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వివిధ దేశాలు భారత్ లో ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తదితర దేశాలకు చెందిన మహిళా క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. విదేశీ క్రికెటర్లు అందుబాటులో లేకుండా పోవడంతో స్వదేశీ మహిళా క్రికెటర్లతోనే చాలెంజ్ టోర్నీని నిర్వహించాలని బిసిసిఐ బావిస్తోంది.

అయితే దీనిపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన మాత్రం రాలేదు. ఒకవైపు పురుషుల ఐపిఎల్‌నే రద్దు చేయాల ని డిమాండ్ పెరుగుతున్న సమయంలో బిసిసిఐ మహిళల చాలెంజ్ ట్రోఫీని నిర్వహించి మరింత అపవాదు మూట గట్టుకుంటుందా అంటే లేదనే చెప్పాలి. దీంతో ఈసారి మహిళల ఐపిఎల్ జరగడం కష్టమేనని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News