Monday, April 29, 2024

ఉద్యోగంలో పని ఒత్తిడి… పశుసంవర్థక సహాయకుడు ఆత్మహత్యాయత్నం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: పశుసంవర్థక సహాయకుడు శ్రీనాథ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా వజ్రకరూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. గూళ్యపాలెం ఆర్‌బికెలో శ్రీనాథ్ అనే వ్యక్తి సశుసంవర్థక సహాయకుడిగా పని చేస్తున్నాడు. నివాసం ఉంటున్న గదిలో శ్రీనాథ్ పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మూడు ఆర్‌బికేలకు శ్రీనాథ్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బిఎల్‌ఓగా విధులు నిర్వర్తించాలని అధికారులు ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్‌బికె విధుల్లో పని ఒత్తిడి ఉందని చెప్పినా అధికారులు వినిపించుకోలేదని, ఆదేశాలు ధిక్కరించిన కారణంగా శ్రీనాథ్‌ను సస్పెండ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. దీంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తన్నారు.

Also Read: కరీంనగర్ లో ఎలుగుబంటి హల్చల్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News