Monday, April 29, 2024

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

- Advertisement -
- Advertisement -

అలంపూర్ : కాంగ్రెస్ పార్టీ పిలు పు మేరకు అలం పూర్ నియోజకవ ర్గంలో ని అలంపూ ర్ మండలం, జిల్లె ల పాడు గ్రామం లోని గిరిజన లం బాడితండాకి వెళ్లి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని మాజీ ఎమ్మెల్యే డా.ఎస్‌ఏ. సంపత్‌కుమార్ తండాలో ఘనంగా జరుపుకున్నారు. సేవాలాల్ మహరాజ్ , బాబా సాహెబ్ , అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గిరిజన, బంజా రా, లంబాడి ప్రజలతో మమేకమై వారితో కలిసి ముచ్చటిస్తూ వారితో కలిసి ఆనందంగా గడిపారు.

మిఠాయిలు పంచుకొని ప్రపంచ ఆదివాసి దినోత్స వాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వాడ వాడలో పర్యటించి అక్కడి ప్ర జల కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీన ర్ వడ్డేపల్లి దేవేంద్ర, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు, మండల అధ్యక్షు లు రాము, ఇటిక్యాల మండల అధ్యక్షులు రుక్మానందరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగశిరోమణి, అయిజ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సులోచన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News