- Advertisement -
సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కోహ్లీసేన ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. దీంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ భారత్ కు శుభారంభాన్ని అందించారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ వీరిద్దరూ అర్థశతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే, జట్టు స్కోరు 62 పరుగుల వద్ద జెమిసన్ బౌలింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ(34) పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గిల్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. ప్రస్తుతం శుభమన్ గిల్(27), పుజారా(0)లు క్రీజులో ఉన్నారు.
WTC Final: Rohit Sharma falls after 62 runs against NZ
- Advertisement -