- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎంఎల్ఎ ఉండవల్లి శ్రీదేవి కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంఎల్ఎ శ్రీదేవికి వైరస్ సోకిన క్రమంలో ఆమె అశ్రద్ధ చేయడంతో ఊపిరితిత్తుల సమస్య తీవ్రమైంది. దీంతో శ్రీదేవిని ఆసుపత్రిలో చేర్పించారు. శ్రీదేవి ఆరోగ్యంపై ఎపి సిఎంవొ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.
YCP MLA Sridevi test positive for Covid 19
- Advertisement -