Thursday, May 9, 2024

ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తా: బాబు

- Advertisement -
- Advertisement -

YCP MLAs comments on CBNs Wife

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని వైసిపి ఎంఎల్ఎలు వ్యక్తిగతంగా కించపరుస్తూ విమర్శలు చేయడంతో ఆయన అసహనానికి గురయ్యారు. అత్యవసర టిడిఎల్ పి సమావేశంలో బాబు కంటతడి పెట్టారు. ఇంట్లో మహిళలను కూడా వదలకుండా వ్యక్తిగత దాడి చేయటంపై బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ గెలిచాకే అసెంబ్లీ లో అడుగు పెడతానని, ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని బాబు ఛాలెంజ్ చేశారు.

సోషల్ మీడియాలో చంద్రబాబుకు మద్దతు ఓ వార్త సంచలనంగా మారింది.

‘క్షమించు తల్లీ!’….
ఆమెను (భువనేశ్వరి) క్షోభపెట్టేలా కురుసభకు మించి అమరావతి సభలో అవమానించారు. దక్కిన పరాభవంతో ధర్మరాజులా తలదించుకొని వచ్చిన చంద్రబాబు నాయుడిని, మీరే ఓదార్చాలి. కోట్లాది మంది తెలుగువారికి ఆరాధ్యుడే కాదు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ వరకు ఆయన అంటే అందరికీ అభిమానం…
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News