Monday, April 29, 2024

ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ప్రేమోన్మాది కత్తితో దాడి చేయడంతో యువతి మరణించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పెనమూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయిత్రి(21), చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు ఆమెను ప్రేమించాలని వేధిస్తున్నాడు. కొంత కాలంగా వారిద్దరి మధ్య పరిచయం ఉన్నట్టు సమాచారం. మంగళవారం గాయిత్రి తన బంధువులలో అమ్మాయితో కలిసి స్కూటీపై ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో వాహనాన్ని అడ్డుకొని కత్తితో పలుమార్లు కడుపులో పొడిచాడు. గాయపడిన యువతిని వాహనదారులు పెనమూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో తమిళనాడులోని వేమూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో యువతి చనిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News