Monday, April 29, 2024

కాంగ్రెస్ లోకి గద్వాల్ జడ్పీ చైర్ పర్సన్

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల్: గద్వాల్ జడ్పీ చైర్ పర్సన్ సరిత, తిరుపతయ్య కాంగ్రెస్ లోకి చేరే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ లోని మల్లు రవి ఇంట్లో తిరుపతయ్య రహస్యంగా చర్చలు జరిపారు. అనంతరం మల్లు రవి ఇంట్లోనే పిసిపి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తిరుపతయ్య కలిశారు. జడ్పీ చైర్ పర్సన్ సరిత, తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరికపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. జడ్పీ చైర్ పర్సన్ సరిత, తిరుపతయ్య పార్టీ మార్పుపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ ద్వారా జూపల్లి కృష్ణారావుతో పాటుగా ఇరువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

Also Read: బచ్చన్నపేట ఎస్ఐని సస్పెండ్ చేసిన సిపి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News