Monday, April 29, 2024

నోట్లో, చెప్పుల్లో బంగారం తరలింపు..

- Advertisement -
- Advertisement -

నోట్లో, చెప్పుల్లో బంగారం తరలింపు
శంషాబాద్‌లో పట్టుబడ్డ నలుగురు నిందితులు

మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్ర వరకు 1.065 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో ఈ రెండు రోజుల్లో షార్జా నుంచి వచ్చిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం బంగారం అక్రమ రవాణాకు పాల్పడిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన సదరు వ్యక్తి ప్రత్యేకంగా రూపొందించిన చెప్పుల్లో పేస్ట్ రూపంలో 672 గ్రాముల పసిడిని దాచిపెట్టాడు. తనిఖీల సమయంలో గుర్తించిన అధికారులు 594 గ్రాముల నికర బంగారాన్ని వెలికి తీశారు.

దీని విలువ రూ.27.4 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నోట్లో దాచిపెట్టి షార్జా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన నలుగురి ప్రయాణికుల వద్ద నుంచి 471 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేస్తుకున్నారు. దీని విలువ రూ.20.67 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరంతా బంగారం ముక్కలను నోట్లో దాచిపెట్టుకుని ఎయిర్‌పోర్టు నుంచి గ్రీన్‌చానెల్ ద్వారా బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు వారిని తనిఖీ చేయగా బంగారం దొరడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

1 kg Gold seized in Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News