Monday, April 29, 2024

ఎపిలో కొత్తగా 10వేల కేసులు.. 88మంది మృతి

- Advertisement -
- Advertisement -

10603 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రతీరోజు 8 నుంచి 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 63,077మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 10,603 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 88మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,24,767కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 3,884మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 99,129మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 9,067మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 3,21,754మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 36,66,422 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

10603 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News