Monday, April 29, 2024

47 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు…

- Advertisement -
- Advertisement -

1196 New Covid Cases 5 Deaths in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల సంఖ్య 47 లక్షలు దాటింది. గత ఎనిమిది నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 47,29,401 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంటే ప్రతి లక్షల మందిలో లక్షా 27 వేల మందికి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా మంగళవారం 44,635 పరీక్షలు నిర్వహించగా 1196 పాజిటివ్‌లు తేలాయి.

వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 192 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 12, భద్రాద్రి 81, జగిత్యాల 21, జనగాం 15, భూపాలపల్లి 11, గద్వాల 4, కామారెడ్డి 26, కరీంనగర్ 73 ,ఖమ్మం 42, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 25, మహబూబాబాద్ 10, మంచిర్యాల 24, మెదక్ 18 , మేడ్చల్ మల్కాజ్‌గిరి 101, ములుగు 21, నాగర్‌కర్నూల్ 18, నల్గొండ 89, నారాయణపేట్ 3, నిర్మల్ 11, నిజామాబాద్ 23, పెద్దపల్లి 24, సిరిసిల్లా 25, రంగారెడ్డి 121, సంగారెడ్డి 36, సిద్ధిపేట్ 30, సూర్యాపేట్ 26, వికారాబాద్ 21, వనపర్తి 9, వరంగల్ రూరల్ 15, వరంగల్ అర్బన్ లో 51, యాదాద్రిలో మరో 14 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,53,651కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,34,234కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

44 శాతం ప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు…

రాష్ట్రంలో ప్రతి రోజూ నిర్వహించే పరీక్షల్లో 44 శాతం మంది ప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ నివేదికలో పేర్కొంది. రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో టెస్టులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. దాదాపు ప్రతి రోజూ 60 వేల నుంచి గరిష్ఠంగా లక్ష టెస్టులు చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వాసుపత్రులు, టెస్టింగ్ కేంద్రాల్లో మౌళిక వసతులను కల్పించినట్లు ఆయన వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News