- Advertisement -
మెక్సికో: మెక్సికోలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చియపాస్ రాష్ట్రంలోని ఫ్రంటేరా, లాట్రినిటారియా మధ్యలో అతివేగంతో వెళ్తున్న బస్సు గోడను ఢీకొట్టడంతో 13 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్టు గుర్తించారు.
- Advertisement -