Monday, April 29, 2024

మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి విచారిస్తుండగా కానిస్టేబుల్‌పై దాడి చేసిన సంఘటన నగరంలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న శ్రీనాథ్, పరమేష్ ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి విచారిస్తుండగా కానిస్టేబుల్ కిరణ్‌పై ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్ కిరణ్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు నిందితులు దాడి సమయంలో మద్యం తాగి ఉన్నట్లు తెలిసింది. గోపాలపురం ఎసిపి వెంకటరమణ కేసు విచారణ జరుపుతున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎసిపి వెంకటరమణ తెలిపారు.

2 Accused attack on Constable in Chilkalguda PS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News