మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో శనివారం దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళ వద్ద 2.021 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.96.04 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎయిర్పోర్ట్లో తనిఖీల సమయంలో మహిళ బ్యాగులో ఉన్న బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్న అనంతరం సదరు మహిళను కస్టమ్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. ఎఐ 952 విమానంలో శనివారం దుబాయ్ నుండి హైదరాబాద్కు వచ్చిన మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లను సోదా చేయగా ఆమె దగ్గర ఐదు బంగారు బిస్కెట్లతో పాటు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. బ్యాగులో వస్తుసామాగ్రిలో బంగారం, నగలను దాచి తరలించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోవడంతో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
2 Kg Gold Seized at Shamshabad Airport