Monday, April 29, 2024

పుల్వామాలో ఎన్ కౌంటర్..

- Advertisement -
- Advertisement -

2 Terrorists Killed in Pulwama Encounter

శ్రీనగర్: పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఈ సమయంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఘటనాస్థలంలో రెండు ఏకే 47 రైఫిళ్లు, ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

2 Terrorists Killed in Pulwama Encounter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News