Thursday, May 9, 2024

ఎపిలో కొత్తగా 2,345 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2345 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో 81,740 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,345 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమంయలో మరో 16 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 3001 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆంధ్రలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 1,93,4450కి  చేరింది. ఇప్పటి వరకు 1,89,6499 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,854 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనాతో ఇప్పటివరకు 13,097 మృతిచెందారని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

 

2345 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News