Monday, April 29, 2024

సురక్షితం, మంచి రాబడి

- Advertisement -
- Advertisement -

Post office schemes that double Money in less time

 

న్యూఢిల్లీ : పోస్టాఫీసు అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. కష్టపడి సంపాదించిన సొమ్ము భద్రంగా ఉండడంతో మంచి రాబడిని ఇవ్వాలి. దీనికి పోస్టాఫీసు అందించే పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గత సెప్టెంబర్ త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలాంటి పథకాలేమిటో ఓసారి పరిశీలిద్దాం.

సుకన్య సమృద్ధి యోజన

ఇందులో అత్యధికంగా 7.6 శాతం వడ్డీ లభిస్తుంది.
ఈ పథకం చిన్నారులకు చెందినది.
9.47 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అవుతుంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్‌సిఎస్‌ఎస్)

ఎస్‌సిఎస్‌ఎస్ పథకం కింద 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
9.73 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అవుతుంది.

పిపిఎఫ్ పథకం (పిపిఎఫ్)

పిపిఎఫ్ పథకంలో వడ్డీ రేటు ఎక్కువగా ఉంది, అందులో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.
10.14 సంవత్సరాలలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది.

మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (ఎంఐఎస్)

ఎంఐఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 6.6 శాతం వడ్డీని పొందొచ్చు.
ఈ పథకంతో 10.91 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అవుతుంది.

నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి)

ఎన్‌ఎస్‌సిలో పెట్టుబడి పెడితే 6.8 శాతం వడ్డీ ఇస్తారు.
ఇది 5 సంవత్సరాల పొదుపు ప్రణాళిక.
10.59 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అవుతుంది.

టైమ్ డిపాజిట్ స్కీమ్ (టిడి)

1 నుండి 3 సంవత్సరాల టైమ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా 5.5 శాతం వడ్డీ లభిస్తుంది.
దీంతో మీ డబ్బు 13 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.
5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే 6.7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో పదకొండున్నర సంవత్సరాల్లో డబ్బు రెట్టింపు అవుతుంది.

రికరింగ్ డిపాజిట్ పథకం (ఆర్‌డి)

ఆర్‌డిలో 5.8 శాతం వడ్డీ వస్తుంది.
దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా 12.41 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అవుతుంది.

సేవింగ్స్ బ్యాంక్ ఖాతా

పోస్టాఫీస్ పొదుపు ఖాతాలో 4 శాతం వడ్డీ లభిస్తుంది.
దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా 18 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News