Monday, April 29, 2024

భారత్ @ 3.26 లక్షల కరోనా కేసులు… 3890 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Six Corona Strain Cases Registered In India

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు దాదాపుగా నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా వైరస్ ధాటికి భారత ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ప్రధాన ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారాయి. గత 24 గంటల్లో 3.26 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 3890 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.43 కోట్లకు చేరుకోగా 2.66 లక్షల మంది దుర్మరణం చెందారు. ప్రస్తుతం కరోనా వ్యాధి నుంచి 2.04 కోట్ల మంది కోలుకోగా 36.73 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 18.04 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 31.3 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News