Monday, April 29, 2024

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. బారముల్లా జిల్లాలోని  సోపోర్‌లో సమీపంలోని గుండ్‌బ్రాత్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు కలిసి సంయుక్తంగా ఆదివారం అర్థరాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో లష్కరే ఉగ్రవాదుల్లో ముఖ్యుడైన ముదసిర్‌ పండిత్‌ కూడా ఉన్నాడని ఐజిపి విజయ్‌ కుమార్‌ చెప్పారు. ఇటీవల సోపోర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగురు పోలీసులు, ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు పౌరులను చంపడంలో ముదసిర్‌ పండిత్‌ పాలుపంచుకున్నట్లు ఆయన తెలిపారు.

3 Terrorists killed in Sopore Encounter in Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News