Monday, April 29, 2024

దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

30254 New Covid-19 Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 30,254 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 391మంది మృతి చెందారు. అదే సమయంలో 33,136 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 98,57,029కు పెరిగాయి. దేశవ్యాప్తంగా 1,43,019 మంది కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ప్రస్తుతం 3,56,546 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు  93,57,464 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. దేశంలో నిన్న 30,006 కోవిడ్ కేసులు, మరణాలు 442 మరణాలు నమోదయ్యాయి. డిసెంబర్ 12 వరకు మొత్తం 15,37,11,833 నమూనాలను పరీక్షించారు. వీటిలో నిన్న 10,14,434 మందికి కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.

30254 New Covid-19 Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News