- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 61,148 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 338 మందికి కోవిడ్-19 సోకింది. ఈ వైరస్ బారినపడి మరో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 8.82 లక్షలకు చేరాయి. కరోనా మరణాల సంఖ్య 7,108కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 3,262 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 8.71లక్షల మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో మొత్తం 1.18 కోట్ల మందికి కరోనా టెస్టులు చేసినట్టు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.
338 New Covid-19 Cases Reported in AP
- Advertisement -