Monday, April 29, 2024

మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 57మంది మృతి

- Advertisement -
- Advertisement -

ట్యునిష్: ట్యునీషియాలో ఘోర ప్రమాదం సంభవించింది. మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 57 మంది మృతి చెందారు. మరో 33 మందిని రక్షించినట్టు ట్యునీషియాకు చెందిన రెడ్ క్రైసెంట్ సంస్థ తెలియచేసింది. లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్న వలసదారుల పడవ ట్యునీషియా తీరం వద్ద మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 90 మంది ఉన్నారని, 33 మంది ప్రాణాలతో బయటపడ్డారని వీరంతా బంగ్లాదేశీయులని రెడ్ క్రైసెంట్ అధికారి మొంగిస్లిమ్ చెప్పారు. ఇటీవల ట్యునీషియా తీరంలో పడవలు మునిగిపోయే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఇటీవల 60 మందికి పైగా వలసదారులు చనిపోయారు.

57 dead after boat Capsized off Tunisia’s Coast

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News