- Advertisement -
చండీగఢ్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పుండ్రీ ధంద్ రహదారిలో వీరు ప్రయాణిస్తున్న ఎస్యువి వాహనాన్ని మరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని జిల్లా పోలీసులు తెలిపారు. మృతులంతా 19, 25 మధ్య వయస్కులే. హరీద్వార్కు వెళ్లి తిరిగి వారివారి స్వగ్రామాలకు వెళ్లుతుండగా శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
6 dead in Road Accident in Haryana
- Advertisement -