మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖలో ఎస్పి స్థాయి నుంచి డిఐజిలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపిఎస్ల అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 బ్యాచ్కు చెందిన ఆరుగురు ఐపిఎస్ అధికారులకు డిఐజిలుగా ఇప్పటికే పదోన్నతులు కల్పించారు. తాజాగా వారికి డిఐజి ర్యాంకు స్థాయిలో పోస్టింగ్లు ఇచ్చారు. డిఐజి హోదాలో నిజామాబాద్ పోలీసు కమిషనర్గా కార్తికేయ కొనసాగుతారు. డిఐజి హోదాలో రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీ ఉప సంచాలకులుగా రమేష్ నాయుడు బాధ్యతలు నిర్వర్తిస్తారు. డిఐజి హోదాతో రామగుండం పోలీస్ కమిషనర్గా సత్యనారాయణ కొనసాగుతారు. సిఐడి విభాగంలో డిఐజిలుగా సుమతి, శ్రీనివాసులు బాధ్యతలు నిర్వర్తిస్తారు. సైబరాబాద్ సంయుక్త పోలీస్ కమిషనర్గా వెంకటేశ్వరరావును నియమించారు. అయితే వెంకటేశ్వరరావు మాదాపూర్ డిసిపిగా కూడా ఆయన పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించన్నుట్లు పోలీసులు బాసులు వివరిస్తున్నారు.
6 IPS Officers get promotions in Telangana