- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 667 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 914 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 8,71,972కి చేరింది. ఎపిలో ఇప్పటివరకు 7,033 మంది మృతి చెందారు. ఆంధ్రాలో ఇప్పటివరకు 8,59,029 లక్షల మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ప్రస్తుతం 5,910 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో 60,329 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వైద్యులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
- Advertisement -