Monday, April 29, 2024

రాష్ట్రంలో మరో 682 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

682 new Covid-19 Cases Reported in Telangana

జిహెచ్‌ఎంసి పరిధిలో 119, జిల్లాల్లో 563 మందికి పాజిటివ్
2,74,540 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 682 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 119 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 12, భద్రాద్రి 24, జగిత్యాల 22, జనగాం 2, భూపాలపల్లి 11, గద్వాల 1, కామారెడ్డి 8, కరీంనగర్ 30,ఖమ్మం 38, ఆసిఫాబాద్ 8, మహబూబ్‌నగర్ 12, మహబూబాబాద్ 8, మంచిర్యాల 28, మెదక్ 7, మేడ్చల్ మల్కాజ్‌గిరి 64, ములుగు 14, నాగర్‌కర్నూల్ 17, నల్గొండ 31, నారాయణపేట్ 5, నిర్మల్ 8, నిజామాబాద్ 12, పెద్దపల్లి 10, సిరిసిల్లా 21, రంగారెడ్డి 47, సంగారెడ్డి 8, సిద్ధిపేట్ 14, సూర్యాపేట్ 23, వికారాబాద్ 6, వనపర్తి 7, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ లో 41, యాదాద్రిలో మరో 14 మందికి వైరస్ సోకింది.

అదే విధంగా వైరస్ దాడిలో మరో ఇద్దరు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,74,540కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,65,367కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. అయితే మరో రెండు నెలల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా హైరిస్క్ గ్రూప్ ప్రజలు వీలైనంత వరకు జనసమ్మర్ధ ప్రదేశాల్లో తిరగకుంటే మేలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మాస్కు, భౌతిక దూరం వంటివి పాటించాలని ఆయన అన్నారు.

2062 మందికి హాస్పిటల్ చికిత్స….

రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో కేవలం 2062 మంది మాత్రమే హాస్పిటల్ చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. మిగిలిన 5634 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించడం వలనే ఇది సాధ్యమైనట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News